మొక్క చెల్లించుకున్న కాంగ్రెస్ నేత కావలి ఆంజనేయులు మేస్త్రీ
//పయనించే సూర్యుడు// న్యూస్ జూన్ 9//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి కి మంత్రి పదవి దక్కడంతో పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కావాలి ఆంజనేయులు మేస్త్రి సోమవారం స్థానిక పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో తన మొక్కును చెల్లించుకున్నారు. వాకిటి కి మంత్రి పదవి వస్తే 101 టెంకాయలు కొడతానని కావాలి ఆంజనేయులు మేస్త్రి మొక్కుకొనగా… ఆదివారం వాకిటి శ్రీహరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో… సోమవారం ఉదయం భార్యాపిల్లలతో కలిసి కావలి ఆంజనేయులు మేస్త్రి 101 టెంకాయలను స్వామివారికి సమర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ఏ రవికుమార్, నాయకులు మందుల నరేందర్, కున్షి నాగేందర్, కల్లూరి గోవర్ధన్, గుంతలి రవి, బోయ నరసింహ, గార్లపల్లి అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.