విద్యా సదస్సు-అభినందన సభను విజయవంతం చేయండి.
IB మక్తల్లో కరపత్రం విడుదల.
ప్రభుత్వం విద్యారంగాన్ని కాపాడుకుందాం.
కామన్ స్కూల్ విద్యావిధానాన్ని సాదించుకుందాం.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యా నిషేధానికై ఉద్యమిద్దాం.
:పయనించే సూర్యుడు: న్యూస్ జూన్ 10: మక్తల్
మక్తల్.డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF)రాష్ట్ర కౌన్సిలర్ పరంధాముములు .తన 37 సంవత్సరాల ఉపాధ్యాయ జీవితం నుంచి, ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా DTF నారాయణపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో,జూన్-15-2025 నాడు,ARM పంక్షన్ హాల్లో (సంగం బండ రోడ్డు) మక్తల్ లో, ఉదయం,10:00 AM నుంచి, "విద్యారంగంలో పాలకులు తెస్తున్న మార్పులు- సమాజంపై ప్రభావం. అనే అంశంపై, "విద్యా సదస్సు- అభినందన సభ"ను నిర్వహిస్తున్నది.
ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా,, ఎన్ వేణుగోపాల్,వీక్షణం ఎడిటర్, ముఖ్య అతిథులుగా వాకిటి శ్రీహరి ,రాష్ట్ర మంత్రి వర్యులు హాజరు అవుతారు. వారితో పాటే,
గోవిందరాజులు నారాయణపేట జిల్లా DEO గౌరవ విద్యాసాగర్ , నారాయణపేట జిల్లా AMO , మరియు, DTF రాష్ట్ర అధ్యక్షులు -సోమయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి- లింగారెడ్డి . నారాయణపేట జిల్లాలోని వివిధ ఉపాధ్యాయ సంఘాలు బాధ్యులు,వివిధ మండలాల MEO లు, పాల్గొంటారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, విద్యారంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోతున్న నేపథ్యంలో, ఉపాధ్యాయులుగా, ప్రజాస్వామ్యవాదులుగా, బుద్ధి జీవులుగా, మనం ప్రభుత్వ విద్యను కాపాడుకునేందుకు కదలాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరికి ఉచిత నాణ్యమైన విద్య అందాలని మనం మాట్లాడాల్సి ఉన్నది. అందుకు కొనసాగింపుగా DTF విద్యా సదస్సుని తలపెట్టింది. ఈ సదస్సులో ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు, విద్యాభిమానులు, ప్రజాస్వామికవాదులు, పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. స్థానిక మక్తల్ లోని ఐబి లో జరిగిన ఈ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో,పరందాములు,(రాష్ట్ర కౌన్సిలర్) ,DTF జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యచంద్ర,అధ్యక్షురాలు హైమావతి.జిల్లా కార్యదర్శి శ్రీ విద్య,DTF మాగనూరు మండల అధ్యక్షులు రాజు,మక్తల్ మండల సహాయ కార్యదర్శి కురుమూర్తి, ఉపాధ్యాయులు,జగపతి,వంశీ రాములు,మానస, కవిత,రేణుక,జ్ఞానేశ్వరి,అరుణ,మునెప్ప, వై చంద్ర శేఖర్, అడ్వొకేట్ సూర్యప్రకాష్,సలీమ్,లింగన్న,
అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పృధ్వీరాజ్, పోలప్ప,KNPS నాయకులు చంద్రశేఖర్,తదితరులు పాల్గొన్నారు.