
పయనించే సూర్యుడుD.19.06.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (TUCI) ఆర్మూర్ డివిజన్ నాయకులు జి.అరవింద్ ఆధ్వర్యంలో,, భీంగల్ మండల కేంద్రంలోని MPDO కార్యాలయం వద్ద 50 మందితో ధర్నా చేసి గ్రామపంచాయతీ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని ఎంపీడీవో కి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది,ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (TUCI) జిల్లానాయకులు కె.రాజేశ్వర్ మాట్లాడుతూ,, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామపంచాయతీ కార్మికులకు పెంచుతానాన్ని ప్రకటించిన జీతాలను వెంటనే అమలు చేయాలని, ప్రతి నెలఒకటో తారీఖు నాడు ఇవ్వాలని, అట్లాగే ఉద్యోగ భద్రత కల్పించి పీఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ అమలు చేయాలి, పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా కార్మిక సంఖ్యను పెంచాలి, పని భారం తగ్గించాలి, మరియు మల్టీపర్పస్ 51 జీవోను రద్దు చేయాలని కారోబార్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని, కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, చనిపోయిన కుటుంబానికి పది లక్షల గ్రాట్యూటీ ఇవ్వాలని,, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో,తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (TUCI) ఆర్మూర్ డివిజన్ నాయకులు జి. అరవింద్,భీంగల్ మండల గ్రామ పంచాయతీ నాయకులు ఏ దేవన్న , కే నాగరాజు, ఎస్ రాజేందర్,భీంగల్ మండలంలోని వివిధ గ్రామాల గ్రామపంచాయతీ కార్మికులు లక్ష్మీరాజ్యం, శీను, పత్రి రాజన్న, ఎర్రన్న సురేష్, సునీత, సువార్త , కవిత, రఘు, లక్ష్మి, భూదేవి, డి కమున, సిద్ధపల్లి రాజవ్వ, ముత్తమ్మ, తదితరులు పాల్గొన్నారు,,