
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్) నందిగామ:నర్సప్పగూడ గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణంతో మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి స్వయంగా కలిసి పరామర్శించారు.గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కావాలి కృష్ణ తల్లి ఈశ్వరమ్మ ,గోవిందు పోచయ్య తండ్రి శ్యామసుందర్, అలాగే మెండే కృష్ణ తండ్రి వెంకటయ్య ఇటీవల కాలంలో స్వర్గస్తులైనారు.వీరితో పాటు మాజీ వార్డు సభ్యులు జగ్గా రాజేందర్ తల్లి జగ్గ భారతమ మరణించిన ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వారి నివాసాలకు వెళ్లి, మృతుల పార్తివ దేహానికి మరియు స్వర్గస్తులైన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కుటుంబ పెద్ద పెద్దలను కోల్పోయి దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ధైర్యం చెబుతూ.. కష్టకాలంలో ప్రతి ఒక్కరికి భగవంతుని తోడు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ సర్పంచ్ కవిత కరుణప్ప, ఉప సర్పంచ్ సిద్దయ్య, మాజీ ఉప సర్పంచ్ శేఖర్,నాయకులు జంగిలి కుమార్,సుదర్శన్ గౌడ్, భూపాల్, సురేందర్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.