పయనించే సూర్యుడు అక్టోబర్ 7 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో " ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్" కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సును ఆరోగ్య ప్రచార రథం ద్వారా నిర్వహించారు. నాయుడుపేట మండలం లోని " LA సాగరం, శ్రీనివాసపురం, విన్నమాల గ్రామంలో మరియు నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమములో MLA శ్రీమతి నెలవల విజయశ్రీ ఇతర రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఆరోగ్య ప్రచార రథం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాప్తి కారకాలు, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ లక్షణాలు, అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్, క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు మరియు చికిత్స గూర్చి, డ్రగ్స్ వాడకం వలన కలిగే ఇబ్బందులు, కండోమ్ యొక్క ఉపయోగము గూర్చి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఏక్ట్ 2017, ఎ.ఆర్.టి మందులు, ఏ.పి.శాక్స్ యాప్ ,టోల్ ఫ్రీ నెంబర్ 1097 గూర్చి తెలుపుతూ, మీ ద్వారా తెలియని వాళ్లకు తెలియజేయమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో MLA నెలవల విజయశ్రీ, ప్రాజెక్టు మేనేజర్ కె. బాలాజి, ఓ.ఆర్.డబ్ల్యూలు టి. శ్రావణి, యమ్. సాయి లక్ష్మి, పి.ఇ లు మరియు 500 మంది ప్రజలు పాల్గొన్నారు. తదుపరి విన్నమాల గ్రామంలో ప్రచార రథం ద్వారా అవగాహన తరువాత 15 మంది ప్రజలుకు నవజీవన్ సంస్థ ఎ.యన్.యమ్ జి.శ్రీలత ద్వారా హెచ్.ఐ.వి పరీక్షలు చేయించి వారి స్థితిని వారికి తెలియజేయడం జరిగింది.