
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్:టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ నూతన రీజినల్ మేనేజర్ బాధ్యతలు స్వీకరించిన ఎస్పీజీకే మూర్తి కి డిప్యూటీ రీజినల్ మేనేజర్, డిపో మేనేజర్లు మరియు రీజియన్ కార్యాలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ ఎస్వీజీకే మూర్తి కి, డిప్యూటీ రీజినల్ మేనేజర్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆరు డిపోల డిపో మేనేజర్లు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్, డిపో మేనేజర్లు, సూపరింటెండెంట్లు మరియు రీజియన్ కార్యాలయ అధికారులు పాల్గొని నూతన రీజినల్ మేనేజర్కు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం నూతన రీజినల్ మేనేజర్ ఎస్వీజీకే మూర్తి జిల్లా కలెక్టర్ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో కొత్త బస్సు మార్గాల అవసరం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు ప్రజా రవాణా సౌకర్యాల విస్తరణ, ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదల, విద్యార్థులు, ఉద్యోగులు మరియు సాధారణ ప్రయాణికులకు మరింత మెరుగైన బస్సు సేవల కల్పన వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సు మార్గాల ప్రతిపాదనలు, ప్రయాణికుల డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అదనపు సర్వీసుల నిర్వహణ, ఆర్టీసీ సేవలను మరింత ప్రజలకు చేరువ చేసే చర్యలపై లపైర రీజినల్ మేనేజర్ ఎస్పీజీకే మూర్తి సంభసిం
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ అధికారులు, ఎంపీవోలు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు."జిల్లా ప్రజలకు సురక్షితమైన, సమయపాలనతో కూడిన, నాణ్యమైన రవాణా సేవలను అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ కట్టుబడి ఉంది అని రీజినల్ మేనేజర్ ఎస్వీజీకే మూర్తి తెలిపారు.! నిజామాబాద్ రీజియన్