సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎస్.కెసాబీర్ పాషా.
పయనించేసూర్యుడు జనవరి 17 (పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి )పాల్వంచ రూరల్:
: జనవరి 17.గెలుపు, ఓటమిని క్రీడాకారులు సమానంగా తీసుకొని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి, ఎస్.కె సాబీర్ పాషా క్రీడాకారులకు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని కొమరం భీమ్ యూత్ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాల గ్రౌండ్లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ నాలుగు రోజులు పాటు నిర్వహించారు. పోటీల్లో మండలం నుండి 20 టీములు పాల్గొనగా హోరాహోరి గా జరిగిన మ్యాచ్లో కిన్నెరసాని జగన్నాధపురం ఫైనల్ మ్యాచ్ ఆడగా జగన్నాధపురం టీం గెలు పొందినది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా ఫస్ట్ ప్రైజ్ జగన్నాధపురం, సెకండ్ ఫ్రై కిన్నెరసాని జట్లకు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సమావేశంలో సాబీర్ పాషా మాట్లాడుతూ కొమరం భీమ్ యువతను అభినందించారు. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తే మెరుగైన ఫలితాలు అందుతాయని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని అన్నారు. భద్రాద్రి జిల్లాలో క్రీడాకారులకు కొదువలేదని, వారికి కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు కల్పించేందుకు స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లా స్థాయిలో రాణించిన క్రీడాకారులు రాష్ట్ర, జీతీయ స్థాయిలోనూ ప్రతిభ కనబర్చి జిల్లాకు వన్నె తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం సిపిఐ పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబు సీపీఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, సిపిఐ మండల నాయకులు నిమ్మల రాంబాబు. కొంగర అప్పారావు ఎస్కే కాసిం విజయ్ కుమార్. కొమరం భీమ్ యువత వజ్జా రామకృష్
వజ్జా విక్రాంత్ తాటి సురేష్ ఎస్.కె. ఆరీఫ్. బొ ర్ర ఉదయ్ రాంబాబు గోకినపల్లి అప్పారావు. శెట్టిపల్లి లక్ష్మణరావు తదితర.క్రీడాకారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.