12 లక్షల 28 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..
( పయనించే సూర్యుడు జూన్ 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
నిరుపేదలకు కార్పోరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, పట్టణాలకు చెందిన24 మంది లబ్ధిదారులకు మంజూరైన 12 లక్షల 28 వేల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిరుపేదలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి అండగా ఉంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని మండల పార్టీ అధ్యక్షుడు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..