
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ని పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ని మరియు ఎంపీ శ్రీమతి ప్రియాంక గాంధీ అరెస్టు చేయడం కు నిరసనగాభైంసాలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన ధర్నా…నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై అభ్యర్థులకు, విద్యార్థులకు మద్దతుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ని అరెస్ట్ చేయడం అత్యంత దారుణమని, ఇది కేవలం కక్షసాధింపు చర్యేనని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు.ఈ మేరకూ భైంసా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను నిలదీస్తున్నందుకే రాహుల్ గాంధీ పై ఇటువంటి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా కేంద్రం కాలరాస్తోందని విమర్శించారు.విద్యార్థుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మరియు కేంద్ర ప్రభుత్వ అణచివేత ధోరణి నశించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపేది లేదని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.