మార్చి 9న వెంకటాపురం మండల కేంద్రంలో న్యాయ నిపుణులతో సదస్సును జయప్రదం చేయండి. గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి
పయనించే సూర్యుడు: ఫిబ్రవరి 19: ములుగు జిల్లా వాజేడు మండల రామ్మూర్తి.ఎ. వాజేడు: ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో ఆర్.అండ్.బి.విశ్రాంతి భవనం ఆవరణంలో ఆదివాసీ నాయకుల సమావేశం ఏర్పాటు చేసి,భద్రాచలం కేంద్రంగా ఆదిమ జాతుల కోసం,న్యాయ కళాశాల కోసం మరో న్యాయ పోరాటంలో భాగంగా మార్చి 9న వెంకటాపురం మండల కేంద్రం కాపేడ్ గ్రౌండ్ లో ఆదివాసి న్యాయ నిపుణులు,ఆదివాసీ సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సదస్సును జయప్రదం చేయాలని కరపత్రాలు విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా జి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి మాట్లాడుతూ,ఏజెన్సీ ప్రాంత అడవి బిడ్డల విద్యారంగంలో ముందుకు రాణించాలని,ప్రత్యేక దృక్పథంతో సుమారు నాలుగు దశాబ్దాలుగా అడవి బిడ్డలుగా అలుపెరగని పోరాటాలు కొనసాగించిన ఘనత గొండ్వాన సంక్షేమ పరిషత్ దక్కిందని,ప్రత్యేక ఉద్యమ సంఘంగా ఆదిమ జాతులకు సేవలు అందించిన చరిత్ర జిఎస్పి కి ఉందని అన్నారు. ఆదిమ జాతుల సంక్షేమాన్ని అభివృద్ధిని మనస్ఫూర్తిగా కాంక్షించిన ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ ఏ గిరిధర్, (ఐ.ఏ.ఎస్.) జి.ఎస్.పి పోరాటాలను గుర్తించి ఆదిమ విద్యార్థులను మరింత విద్యా రంగంలో వెన్ను దన్నుగా నిలిచారని గుర్తుచేశారు.ఉద్యోగ రంగంలో ఆదివాసులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఆనాటి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి జీవో నెంబర్ 3 అమలు పరచాలని ప్రత్యేక కృషి చేసిన ఘనత ఆనాటి కలెక్టర్ శ్రీ ఏ గిరిధర్ కి దక్కిందని,వారి వల్లే భద్రాచలంలో జూనియర్ డిగ్రీ కాలేజీలలో 6%శాతం రిజర్వేషన్ నుండి జీవో నెంబర్ 267 ద్వారా 100% అమలుకు నోచుకుందని ఆయన అన్నారు.అప్పటి ఐటీడీఏ పీవో ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ అప్పటి జిల్లా కలెక్టర్ వారి యొక్క ప్రత్యేక దృష్టి వల్ల భద్రాచలం కేంద్రంలోని టి.టి.సి, బి.ఇ.డి. కాలేజీలు వచ్చాయని అన్నారు.విద్యార్థుల స్వయంపాలన హాస్టల్స్ కూడా 1996,2017 కొనసాగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.ఇదే తరుణంలో ఆదిమ జాతులకు మరింత చైతన్య రాణించేందుకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్,లా తీర్చిదిద్దేందుకు,భూభాగంలో భద్రాచలం కేంద్రంగా ఆదివాసి న్యాయ కళాశాలను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కనితి వెంకటకృష్ణ వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం ప్రతాప్, బొచ్చ నరసింహారావు, కాక శేఖర్,జయబాబు,కారం రాజబాబు,పర్శిక అనిల్ తదితరులు పాల్గొన్నారు.