
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
మూట్ కోర్ట్ పోటీల్లో సత్తా.. ఉత్తమ మెమోరియల్ అవార్డు కైవసంన్యాయ విద్యలో కేవలం పట్టా అందుకోవడమే కాకుండా, తన విలక్షణ ప్రతిభతో అసాధారణ మేధోపటిమను కనబరుస్తున్నారు అనంత్ న్యాయ కళాశాల విద్యార్థి అశోక్ రెడ్డి తిప్పని. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని కళ్యాణ మండపంలో శనివారం ఘనంగా జరిగిన కళాశాల స్నాతకోత్సవంలో ఆయన ఎల్ఎల్బీ (2022, 25) పట్టాను అందుకున్నారు. నిరంతర కృషి, పట్టుదల ఉంటే న్యాయ రంగంలో అగ్రశిఖరాలకు చేరుకోవచ్చని అశోక్ రెడ్డి తన విజయాల ద్వారా నిరూపించి, నేటి తరం విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు.వాదనా పటిమతో అగ్రస్థానంగతంలో అనంత్ న్యాయ కళాశాల నిర్వహించిన మూడవ ఇంట్రా మూట్ కోర్ట్ పోటీల్లో అశోక్ రెడ్డి బృందం అమోఘమైన ప్రతిభను కనబరిచింది. మొత్తం 24 బృందాలు తలపడిన ఈ క్లిష్టమైన పోటీలో, అశోక్ రెడ్డి తన వాదనా పటిమతో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ విజేత బృందంలో ఇందిర, రెయాతా సభ్యులుగా ఉండి సమష్టి కృషితో విజయాన్ని అందుకున్నారు.లిఖిత విశ్లేషణలోనూ మేటివాగ్ధాటిలోనే కాకుండా, న్యాయపరమైన అంశాలను లిఖితపూర్వకంగా విశ్లేషించడంలోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ పోటీలో అశోక్ రెడ్డి రూపొందించిన మెమోరండం అత్యుత్తమమైనదిగా ఎంపికై, ఉత్తమ మెమోరియల్ అవార్డు ను తెచ్చిపెట్టింది. క్లిష్టమైన చట్టపరమైన చిక్కులను విడదీస్తూ ఆయన సిద్ధం చేసిన పత్రాలు న్యాయమూర్తుల ప్రశంసలు పొందాయి. ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జి.బి. రెడ్డి సమక్షంలో జరిగిన కార్యక్రమంలో, ఈ బృందంలోని విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని, మనోధైర్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. భావి న్యాయ వ్యవస్థకు దిక్సూచిగా నిలిచే లక్షణాలు అశోక్ రెడ్డిలో పుష్కలంగా ఉన్నాయని పలువురు న్యాయ నిపుణులు కొనియాడారు. శనివారం జరిగిన స్నాతకోత్సవంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ ములుగారం, ఓయూ లా ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ ఎన్. వెంకటేశ్వర్లు, కళాశాల కరస్పాండెంట్ రవి అనంత్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి. చంద్రమతి చేతుల మీదుగా అశోక్ రెడ్డి పట్టా అందుకున్నారు. భవిష్యత్తులో ఉన్నతమైన న్యాయవాదిగా ఎదిగి సమాజానికి, బాధితులకు అండగా నిలవడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.