యోగాసనాల శిక్షణలో పలువురు విద్యార్థిని విద్యార్థులు
సాధనతో సంపూర్ణ ఆరోగ్యం…. న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ శిక్షకుడు అహ్మద్ ఖాన్( బ్రూస్ లీ)
( పయనించే సూర్యుడు జూన్ 21 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
సాధన తోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ శిక్షకుడు అహ్మద్ ఖాన్ తన వద్ద శిక్షణ పొందుతున్న కుంగ్ ఫు విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని పట్టణంలోని న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీలో యోగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కుంఫు విద్యార్థిని విద్యార్థులు యోగాసనాల సాధన చేస్తూ, మానసిక స్తైర్యం పొందడానికి ధ్యానం చేశారు. ఈ సందర్భంగా శిక్షకుడు అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ యోగాసనాల ద్వారా శారీరక గట్టితనంతో పాటు, ధ్యానం ద్వారా మానసిక బలం చేకూరి విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో పాటు, చదువుల్లో కూడా ముందంజలో ఉంటారని, పోటీ పరీక్షలను తట్టుకొని నిలబడి విజయం సాధించడంలో ముందుంటారని పేర్కొంటూ, సాధన చేయడం ద్వారా మంచి మనుషులుగా మారి సమాజ హితాన్ని కోరుకునే వారమవుతామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు.