పయనించే సూర్యుడు //న్యూస్ జూన్ 9// నారాయణపేట జిల్లా బ్యూరో// బి విశ్వనాథ్
మక్తల్ ఎమ్మెల్యేగా మొదటిసారీ గెలిచిన ఏడదిన్నరకే డాక్టర్ వాకిటి శ్రీహరి రాష్ట్ర మంత్రిగా రాజభవన్ లో నిన్న ప్రమాణ స్వీకారం చేశారు
మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి 17525 ఓట్ల మెజారిటీతో గెలిచారు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చిన ఆయన అన్నీ తొలి ప్రయత్నం లోనే విజయాలను అందుకున్నారు. తొలిసారి 2001 సంవత్సరంలో మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా పోటీచేసి గెలిచారు. 2014 లో మక్తల్ జెడ్పిటిసి గా గెలిచారు. 2022 లో నారాయణపేట కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 2023 డిసెంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలి ప్రయత్నం లోనే విజయం సాధించి తిరిగి ఏడాదిన్నర వ్యవదిలో తెలంగాణ రాష్ట్ర మంత్రి గా.ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వాకిటి శ్రీహరి కుటుంబం యావత్. ప్రజల సేవకోసం పనిచేసింది తండ్రి వాకిటి నర్సిము లు వ్యవసాయంతో పాటు చిన్నపాటి కాంట్రాక్టర్ గా తల్లి రాములమ్మ ఏఎన్ఎం గా మక్తల్ ప్రభుత్వ ధరఖానాలో గర్భిణి స్త్రీలు మొదలుకొని డెలివరీలదాకా ఎంతోమందికి తనవంతుగా కృషి చేసింది భార్య లలితమ్మ మాజీ ఎంపిటిసి, గా తమ్ముడు శేషగిరి మక్తల్ ఉప సర్పంచ్, గా మరదలు జయశ్రీ మక్తల్ మాజీ కౌన్సిలర్, గా అలాగే కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, గా ఇలా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల ఆశీర్వాదాలు అందుకుంటూ నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులుగా వాకిటి శ్రీహరి, ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరము శ్రీహరి మాట్లాడుతూ నాకు ఇంతటి బరువు బాధ్యతలు నా మీద ఉంచి ఎంతో నమ్మకంగా మంత్రి పదవి ఇచ్చినా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున కరిగే,ఏఐసీసీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.కేసీ వేణుగోపాల్, మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి,ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే రాష్ట్ర మంత్రులకు నిత్యం నీడలా నా వెన్నంటి ఉండే నా నియోజకవర్గ ప్రజలకు రుణపడి వారి కి ఎలాంటి కష్టాలు వచ్చిన ఎల్లవేళలా కుటుంబ సభ్యునిగా తోడుగా ఉంటానని అన్నారు