జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం..
పయనించే సూర్యడు,మే 27, కుమార్ యాదవ్, హుజురాబాద్ అర్ సి )
ఆబాది జమ్మికుంట లోని రైతు వేదిక వద్ద జమ్మికుంట మార్కెట్ కమిటి ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న - సదానందం జీలుగ విత్తనాలు ( పచ్చి రొట్టె విత్తనాలు) సబ్సిడీ కింద రైతులకు పంపిణి చేసారు. దీని అనంతరం వారు మాట్లాడుతూ. రైతులు కు జీలుగు విత్తనాతో ఎంతో ఉపయోగ కరముగా ఉండుందన్నారు. మరియు అధిక దిగుబడి కూడ ఉంటుందని తెలియజేసారు. దీనిని ఉపయోగించుకోవాలని రైతులకు తెలిపారు. తదనంతరం జమ్మికుంట పరిధిలో వున్నా (కె వి కె) కృషి విజ్ఞాన కేంద్రమును పరిశీలించారు.రైతులకు మరియు పశువులకు, వ్యవసాయానికి ఉపయోగపడే విత్తనాలు, ఎరువులను, కోళ్ల ఫారములను పరిశీలించారు. రైతులకు భీమా పథకాలు మరియు అన్నీ రకాల సౌకర్యాలు అందించాలి. అని తెలిపారు. వారి వెంట వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.