సంఘటన స్థలాన్ని పరిశీలించిన VHP రాష్ట్ర నాయకులు బండారి రమేష్ , నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి
హిందూ దేవాలయాలపై ఆగని దాడులుదేవాలయాన్ని అపవిత్రం చేసిన దుండగులను కఠినముగా శిక్షించాలి
( పయనించే సూర్యుడు జూన్ 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ పట్టణంలోని పటేల్ రోడ్ లో గల హనుమాన్ దేవాలయంలో గుర్తు తెలియని దుండగుడు దేవాలయం ప్రాంగణంలో ప్లాస్టిక్ కవర్లో గోమాంసం ఉంచిన సంఘటన ఆందోళనని కలిగించింది ప్రశాంతంగా ఉన్న షాద్నగర్ పట్టణం లో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన గుర్తు తెలియని దుండగుడిని వెంటనే గుర్తించాలి,సంఘటన గురించి తెలుసుకున్న బండారి రమేష్, నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారు చేట్ల వెంకటేష్ ప్యాట అశోక్ మల్చమ్ మురళి దేవాలయానికి చేరుకున్నారు. జరిగిన సంఘటన పై దేవాలయ కమిటీ సభ్యులతో చర్చించారు .ఈ సంఘటనకు సంబంధించి ACP ,CI గారి తో మాట్లాడారు .
ఈ సంఘటన ని ఉద్దేశించి విశ్వహిందూ పరిషత్ ప్రాంత కార్యదర్శి బండారి రమేష్ మాట్లాడుతూ షాద్నగర్ పట్టణం లో హిందూ దేవాలయాలపై ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమణి, గతం లో కూడా జానం పేట లో కూడా దాడి జరిగిందని అయినా ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదని, హిందువులు ఏకం కనంత వరకు హిందూ దర్మం పైన, సంస్కృతి పైన విధార్మీయుల ఆగడలు బరిస్తూ ఉండిపోవాలని, ఎప్పుడైతే హిందువులందరు ఏకమై మన హక్కులు మన సంస్కృతి పరిరక్షణ కై పోరాడుతామో అప్పుడు హిందూ ధర్మాని కాపాడుకోగలమని అన్నారు.బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మెజార్టీ ప్రజల మనోభావాలు సంస్కృతి సంప్రదాయాలను అవహేళన చేస్తూ , హిందువుల మత సమరస్యన్ని ఓపికను పరీక్షించడం మంచిది కాదని హిందూ దేవాలయల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది అని నిందితులను గుర్తించి కఠినం గా శిక్షించాలి అని హిందూ సంస్కృతి సంప్రదాయాలపైన దాడులను ఎంతమాత్రం ఉపేక్షించమని రేపటి లోగ నిందితులను పట్టుకోకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు.