వివిధ పనులను ప్రారంభించిన ఎంపీఓ
( పయనించే సూర్యుడు ఆగస్టు 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలోని కడియాల కుంట తండాలో పనుల జాతర కార్యక్రమాన్ని ఫరూక్నగర్ ఎంపీఓ జయంత్ రెడ్డి ప్రారంభించారు. వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో వందరోజులు పని పూర్తి చేసుకున్న కూలీలను సన్మానించడం జరిగింది. వీరితోపాటు గ్రామపంచాయతీ కార్మికులను కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ సెక్రెటరీ జంగయ్య, మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్, మాజీ డిప్యూటీ సర్పంచ్ రెడ్యానాయక్, శ్రీను నాయక్,రాజు, నాయక్,శంకర్ నాయక్, రేడ్య తదితరులు పాల్గొన్నారు