పయనించే సూర్యుడు జూన్ 19 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి మండలంలోని పాత తడికలపూడి గ్రామానికి చెందిన పాస్టర్ బట్టు దేవరాజ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మం హాస్పటల్ చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చాడు తెలుసుకుని గురువారం టేకులపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ సభ్యులు వారి గృహానికి వెళ్లి పాస్టర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వారికి ఆర్థిక సాయం6000. వేల రూపాయలు అందజేయడం జరిగింది. అనంతరం వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేశారు.
ఈ కార్యక్రమంలో టేకులపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ ప్రెసిడెంట్ జి రాజు రామ్ చందర్, సెక్రెటరీ టి బోయాజ్, జాయింట్ సెక్రటరీ ఎం మార్కు, సభ్యులు బి అబ్రహం, దానియేలు, తదితరులు పాల్గొన్నారు.