
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి.
ఈ రోజు కుంటాల మండలంలోని విట్టాపూర్ గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పోచమ్మ ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఎమ్మెల్యే గారు అధికారులతో మరియు క్రాంటక్టర్ ను సూచించారు. ఆలయ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, తక్షణమే నిధులు మంజూరు చేసి ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేయాలని కోరారు. సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో మాట్లాడి ఆలయ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అంబుగాం విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ముధోల్ శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో సరైన రోడ్డు సౌకర్యం లేక గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్డు పూర్తిగా దెబ్బతిని, రాకపోకలు కష్టసాధ్యంగా మారుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ఆస్పత్రులకు వెళ్లే రోగులు, వృద్ధులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యను వివరించారు. తక్షణమే రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని, సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
