పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి జూన్ 9
పేగ పంచాయతీ సూరకుంట గ్రామంలో గోటుల్ - గోండ్వాన అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో, కో ఆర్డినేటర్ సోడే శ్రీను అధ్యక్షతన భగవాన్ బిర్సా ముండా 125 వ వర్ధంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పీసా సెక్రటరీ మరియు యూత్ ప్రెసిడెంట్ సోయం అర్జున్ మాట్లాడుతూ బిర్సా ముండా యొక్క నాయకత్వం, అతి చిన్న వయసులో చేసిన గిరిజన ఉద్యమ సారధ్యన్నీ స్మరించుకున్నారు.19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవి ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడని, 22 ఏళ్ల వయసు 1897 లోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించి బ్రిటిషర్లును గడగడ లాడించిన యోధుడినీ గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆదివాసీల కోసం పోరాటం చేసిన యోధులను ఎవరు కూడా మర్చిపోకుండా వారి ఉద్యమాలను స్పూర్తిగా తీసుకొని ముందు తరాలకు ఉద్యమ స్పూర్తిని ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ పూజారి తోడం జోగయ్య , యూత్ జాయింట్ సెక్రెటరీ తోడం సుబ్బరాజు , తోడం శ్రీవణ్య, గోరం రమేష్ , తోడం ముద్దరాజు , కట్టం శ్రీరాములు, గ్రామస్తులు పాల్గొన్నారు..