పయనించే సూర్యుడుజూన్ 24 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిత్యం పోరాటాలు నిర్వహించాలని సిపిఐ జిల్లా నాయకులు గూగులోత్ రామ్ చందర్ అయిత శ్రీరాములుఅన్నారు. అర్హులైన నిరుపేదలకు రాజకీయ జోక్యం లేకుండా అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం వారు టేకులపల్లి మండలంలోని నూతన గ్రామ శాఖ సభలు నిర్వహించి నూతన కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్నారు
పెట్రాంచలక స్టేజి శాఖ కార్యదర్శి సహాయ కార్యదర్శిగా బాదావత్ రాందాస్ గూగు లోత్ మంగ్యా, బొమ్మనపల్లి శాఖ కార్యదర్శి సహాయ కార్యదర్శిగా డేగల రమేష్ కోరుకొప్పల వెంకటేశ్వర్లు, బిల్లుడు తండా శాఖ కార్యదర్శి సహాయ కార్యదర్శిగా భూక్య మోతి బానోతు విజయ,చింతా లంక శాఖ కార్యదర్శి సహాయ కార్యదర్శిగా జోగా కృష్ణవేణి నాగేంద్రబాబు లను ఎన్నుకున్నారు.