*ఓ వైపు రెసిడెన్షియల్ పాఠశాలల్లో కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పన .
*మరోవైపు ప్రభుత్వ బడుళ్ళో నూతన డెస్క్ బెంచీల ఏర్పాటు .
*సొంత ఖర్చుల తో పేదోళ్ల విద్య కు పెద్దపీఠ వేస్తున్న కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 14. మునుగోడు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికి గ్రామాలలో మార్నింగ్ వాక్ కార్యక్రమానికి మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శ్రీకారం చుట్టారు అందులో భాగంగా గ్రామీణ సమస్యలే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యల పైన విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడి తెలుసుకునేవారు. నెలన్నర క్రితం మునుగోడు మండలం పలివెల గ్రామంలో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కి బెంచీలు సరిగా లేవని విద్యార్థులు రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే కొత్త బెంచీలు ఏర్పాటు చేస్తానని ఆ నిమిషమే హామీ ఇచ్చారు. విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చిన హామీ ప్రకారం తన సొంత ఖర్చు ( 7 లక్షల రూపాయల వ్యయం ) తో పలివెల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు సరిపడా 110 బెంచీలను ప్రత్యేకంగా తయారు చేయించి పాఠశాలలకు ఇచ్చారు. కార్పొరేట్ పాఠశాలలో ఏ విధమైన డెస్క్ బెంచీలు ఉంటాయో వాటికి ఏ మాత్రం తీసిపోకుండా నాణ్యతలో రాజీ పడకుండా ప్రతి తరగతి గదికి డెస్క్ బెంచీలు అందచేశారు. గతంలో తమ పాఠ్యపుస్తకాలను ఎక్కడపడితే అక్కడ వేయాల్సి వచ్చేదని డెస్క్ బెంచీలు ఎమ్మెల్యే సార్ ఇచ్చిన తర్వాత కూర్చున్న ప్లేస్ లోనే పాఠ్యపుస్తకాలను కూడా దాచుకునేలా బెంచిలు ఉన్నాయని విద్యార్థిని విద్యార్థులు మురిసిపోతున్నారు.. విద్యార్థిని విద్యార్థులు కొత్తగా ఏర్పాటు చేసిన డెస్క్ బెంచ్ లపై క్రమశిక్షణతో కూర్చొని శ్రద్ధతో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను వింటూ సంతోషపడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి తన సొంత ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న తీరును చూసి గ్రామస్తులు కృతజ్ఞతలు చెబుతున్నారు.