( పయనించే సూర్యుడు జూన్ 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ప్రగతి వెల్ఫేర్ సొసైటీ, గ్రామీణ ప్రగతి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ - 2025 కోసం 41 అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా అందులో నుండి 23 విద్యార్థులు ఎంపికయ్యారు.ఈ ప్రతిభావంతులైన యువ మేధావులకు ప్రతి సంవత్సరం ఇంటర్ నుండి డిగ్రీ వరకు సంవత్సరానికి 1 లక్ష రూపాయల వరకూ, ఆరు సంవత్సరాలపాటు స్కాలర్షిప్ అందనుంది. అంతేకాకుండా, వారికి మెంటరింగ్ మద్దతు, మరియు వారు వారి గ్రామాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రోత్సాహం కూడా ఇవ్వబడుతుంది.ఈరోజు, ఎంపికైన విద్యార్థుల గౌరవార్థం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు మరియు సర్టిఫికెట్లు అందజేసి వారిని అభినందిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు మాజీ సర్పంచ్ సుమన , రిటైర్డు హేడ్ మాస్టర్ సురేష్ కుమార్ గ, ప్రధాన ఉపాధ్యాయులు రామకృష్ణ , శ్రీకాంత్ ఉపాధ్యాయులు రాజేశ్వర్ , సీనియర్ ప్రోగ్రాం మేనేజర్ మురళీ కృష్ణ, ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ జగదీష్, శ్రీకాంత్, కార్తీక్, ప్రగతి, తులసి, శ్వేతా, శృతి, నవ్య, లావణ్య ఈ కార్యక్రం లో పాల్గొనడం జరిగింది ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంత విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు దృఢమైన పునాదులు నిర్మించడమే ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ముఖ్య ఉద్దేశం అని సంస్థ సభ్యులు తెలిపారు.