పయనించే సూర్యుడు అక్టోబర్ 7 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో " ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్" కార్యక్రమం లో భాగంగా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు "సమగ్ర ఆరోగ్య ప్రచార రథం" మరియు ర్యాలీ ల ద్వారా నిర్వహించారు. సూళ్లూరుపేట మండలం లోని " VSR కాలని, షార్ రోడ్, సాయి నగర్ ఏరియాలలో మరియు సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమములో మెడికల్ ఆఫీసర్ సి.హెచ్.రమేష్, ఇతర హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ కె. బాలాజి మాట్లాడుతూ "సమగ్ర ఆరోగ్య ప్రచార రథం" ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాప్తి కారకాలు, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ లక్షణాలు, అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్, క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు మరియు చికిత్స గూర్చి, డ్రగ్స్ వాడకం వలన కలిగే ఇబ్బందులు, కండోమ్ యొక్క ఉపయోగము గూర్చి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఏక్ట్ 2017, ఎ.ఆర్.టి మందులు, ఏ.పి.శాక్స్ యాప్ ,టోల్ ఫ్రీ నెంబర్ 1097 గూర్చి తెలుపుతున్నామని, మీ ద్వారా తెలియని వాళ్లకు తెలియజేయమని చెప్పడం జరిగింది. షార్ రోడ్ ఏరియాలో ర్యాలీని కూడా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమాలన్నింటిలో ప్రాజెక్టు మేనేజర్ కె. బాలాజి, ఓ.ఆర్.డబ్ల్యూలు కె. మంజుల, టి. నందిని, ఎ.యన్.యమ్ జి. శ్రీ లత, పి.ఇ లు మరియు 500 మంది ప్రజలు పాల్గొన్నారు. చివరిగా సాయి నగర్ ఏరియాలలో 14 మంది ప్రజలుకు నవజీవన్ సంస్థ ఎ.యన్.యమ్ ద్వారా హెచ్.ఐ.వి పరీక్షలు చేయించి వారి స్థితిని వారికి తెలియజేయడం జరిగింది.