
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి
ఆర్జీయూకేటీ బాసరకు చెందిన పలువురు ఇంజినీరింగ్ విద్యార్థులు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ 'సిమెన్స్ ఇండియా' నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన సిమెన్స్ స్కాలర్షిప్ ప్రోగ్రాంకు ఎంపికయ్యారు. ప్రతిభావంతులైన యువ ఇంజినీర్లను ప్రోత్సహించడం, వారిని భవిష్యత్తు టెక్నాలజీ నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సిమెన్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ స్కాలర్షిప్ ద్వారా ఎంపికైన విద్యార్థులకు కేవలం ఆర్థిక సహాయమే కాకుండా, సమగ్రమైన వృత్తిపరమైన అభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది. ఇందులో ప్రధానంగా విద్య కోసం పూర్తి స్థాయి ఆర్థిక సహాయం. పరిశ్రమ నిపుణుల ద్వారా ప్రత్యక్ష మెంటర్షిప్. అధునాతన టెక్నికల్ ట్రైనింగ్ మరియు పరిశ్రమ అనుభవం. ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు.ఆధునిక ఇంజినీరింగ్ పద్ధతులపై ప్రాక్టికల్ అవగాహన.ఈ సందర్భంగా స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థులను విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్, ఓ.ఎస్.డి. ప్రొఫెసర్ ఈ. మురళీ దర్శన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ అవకాశం విద్యార్థులు తమ కెరీర్లో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మరియు దేశ సాంకేతిక అభివృద్ధికి తోడ్పడటానికి ఉపయోగపడుతుందని వారు ఆకాంక్షించారు.తమ ప్రతిభను గుర్తించి ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన సిమెన్స్ సంస్థకు విద్యార్థులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఎంపిక ప్రక్రియలో నిరంతరం మార్గనిర్దేశం చేసిన యూనివర్సిటీ మేనేజ్మెంట్, స్కాలర్షిప్ సెక్షన్ మరియు ప్రత్యేకంగా తమ వెన్నంటి నిలిచిన అసోసియేట్ డా. విటల్ కు విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్కాలర్షిప్ సెక్షన్ ఫ్యాకల్టీ ఇంచార్జ్ డా. ఎస్. విటల్, డా. టి. రాకేష్ రెడ్డి, డా. బావ్ సింగ్ పాల్గొన్నారు. వీరితో పాటు స్కాలర్షిప్ సెక్షన్ సిబ్బంది బి. శ్వేత, సమీనా, చిన్నారెడ్డి, శ్యామ్, హిమ బిందు తదితరులు పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు.