పయనించే సూర్యుడు జూన్ 6 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి: శుక్రవారం జడ్.పి.ఎస్ బోడు పాఠశాల పరిధిలో బడి బాట నిర్వహించారు. గ్రామములో గడప గడపకు తిరుగుతూ కరపత్రాలు పంచుతూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని మన ఊరి పిల్లలందరూ మనబడి లోనే చదవాలని నాణ్యమైన విద్య ఉచిత భోజనం, ఉచిత పుస్తకాలు, మరియు యూనిఫామ్ పంపిణీ చేస్తున్నారని, టేకులపల్లి విద్యాశాఖ అధికారి ఏ జగన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
ఉపాధ్యాయులు బాలాజీరావు నాయక్, కేగర్ల శ్రీను, యూత్ లీడర్స్ శేఖర్ మణికంత్, వీరభద్రం ఉపాధ్యాయులు గిరిబాబు, లక్ష్మణ్,కిషోర్, పాల్గొన్నారు.