TJAC షాద్ నగర్ తాలూకా ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ వర్ధంతి వేడుకలు
ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ మరియు స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు జూన్ 21 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
తెలంగాణ జాతిపిత,సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ 14వ వర్ధంతి సందర్భంగా ఫరూక్ నగర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆచార్య జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఘనంగా నివాళులర్పించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొంకళ్ల చెన్నయ్య,పి.రఘునాయక్, బిజెపి సీనియర్ నాయకులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి అందే బాబయ్య మల్చల మురళి లు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.ఇట్టి కార్యక్రమంలో తాలుకా జేఏసి చైర్మన్ ఎం.జనార్ధన్,టీజీ శ్రీనివాస్,టీ.కరుణాకర్,RI వెంకట్ రెడ్డి, కన్వీనర్ నక్క బాల్ రాజ్, హెల్త్ డిపార్ట్మెంట్ జక్కుల శ్రీనివాస్ యాదవ్, అర్జునప్ప,RTC అర్జున్ కుమార్,మందారం నరసింహులు,టెలిఫోన్ వెంకటయ్య, రిటైర్డ్ తహసిల్దార్ రామారావు,అనంతం,రఘు, స్వాములయ్య,నర్సింలు, కృష్ణయ్య లతో పాటు తెలంగాణ తొలిదశ,మలిదశ ఉద్యమకారులతో పాటు,ప్రజా ప్రతినిధులు,అధికారులు, ఉద్యోగులు,ఉపాధ్యాయులు, కార్మికులు ,ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేశారు.