పయనించే సూర్యుడుజూన్ 19 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :తడికలపుడి గ్రామ పంచాయతీ కోక్యతండా గ్రామం లో ఇటీవల దరవత్ మంగిణి అనారోగ్యం చే మరణించడం జరిగింది, అది గమనించిన కాంగ్రెస్ నాయకులు ధరావత్ లక్ష్మణ్ వారి కుటుంబ సభ్యులకు ఖర్మ ఖండలకు 50 కేజీ ల బియ్యాన్ని అందజేశారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ నేను ఎమ్మెల్యే కోరం కనకయ్య, అభిమానినని ఎమ్మెల్యే స్ఫూర్తితో గ్రామంలో అనారోగ్యంతో పేదవారు ఎవరైనా చనిపోతే నా వంతుగా వారి కి ఆర్థిక సహాయం అందిస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో దరవత్ కుమార్,రాంసింగ్, భద్రు, సక్రు, గోపాల్ పాల్గోన్నారు.