పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా( రిపోర్టర్ జిన్న అశోక్ )ఎనిమిది సంవత్సరాల బాలికపై అత్యారం చేసిన నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ ఫోక్స్ న్యాయమూర్తి నీలిమ తీర్పు ఇచ్చినట్లు ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు.. పెద్ద శంకరంపేట మండలం మడ్చెట్ పల్లి గ్రామానికి చెందిన తలారి మోహన్ గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికపై చాక్లెట్ ఆశ చూపి2020 లో అత్యాచారం జరపగా అప్పట్లో ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు కాగా మెదక్ జిల్లా స్పెషల్ కోర్టు కేసు విచారణ చేపట్టి తలారి మోహన్ దొషిగా తేలుస్తూ నిందితుడికి 20 సంవత్సరాల కారాగార శిక్ష ఐదువేల జరిమానా విధించినట్లు పెద్ద శంకరంపేట ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు..