
కారు ప్రమాదం అనంతరం లక్ష్మీ ప్రసన్నను పరామర్శ
పయనించే సూర్యుడు ఆగస్టు 6 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)ఇటీవల కారు ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్నను కాకినాడలో వారి స్వగృహం నందు డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్, ఎస్.ఐ.ఆర్ జిల్లా సహ సమన్వయకర్త కృష్ణ సుందర్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి సతీష్ రావు తదితర బిజెపి నాయకులు కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.