
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి: తానూర్, జూలై 14:మండల పరిధిలోని బోల్సా గ్రామంలో రోడ్డు సౌకర్యం లేని వీధుల్లో మట్టి, మొరం వేసే పనులను మంగళవారం స్థానిక సి .హెచ్. సర్పంచ్ సుదర్శన్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గ్రామంలోని కొన్ని వీధులు బురదమయంగా మారి, కనీసం నడవడానికి కూడా వీల్లేకుండా తయారయ్యాయి. దీంతో ప్రజలు, వాహనదారులు పడుతున్న తీవ్ర ఇబ్బందులను గమనించిన సర్పంచ్ సి .హెచ్. సుదర్శన్ వెంటనే స్పందించారు.రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు అత్యవసరంగా బురద రోడ్లపై మట్టి, మొరం పోయించి తాత్కాలికంగా మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్నామని, రాబోయే రోజుల్లో ఈ వీధుల్లో శాశ్వత సిమెంట్ రోడ్ల నిర్మాణానికి తగిన నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.సమస్యను గుర్తించిన వెంటనే స్పందించి, రోడ్లను బాగు చేయించిన సర్పంచ్ సి .హెచ్. సుదర్శన్ చొరవను గ్రామ ప్రజలు ఈ సందర్భంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, స్థానిక నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.