
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
శబరిమల యాత్రకు వచ్చే అయ్యప్ప భక్తులకు పరిశుభ్రమైన తాగునీరు నిరంతరంగా అందించేందుకు నీటిఆథారిటీ విస్తృత చర్యలు చేపట్టింది. సన్నిధానం ముందు ప్రాంతం నుండి పంబా పాపంతల్ వరకు, నీల్ క్కల్ వరకు ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో తాగునీటి పంపిణీ నిర్వహించబడుతోంది.అత్యాధునిక శుద్ధీకరణ మరియు పంపిణీ వ్యవస్థ భక్తులకు పరిశుభ్రమైన నీరు సరఫరా చేయడానికి, పంబా త్రివేణి వద్ద గంటకు ముప్పై ఐదు వేల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో పద ముడు యమ్ యల్ డి ప్రెషర్ ఫిల్టర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.ప్రపంచ స్థాయి యువి ఆర్ఒ టెక్నాలజీలతో నీటి శుద్ధీకరణ జరుగుతోంది.పంబా నుండి పాపంతల్ వరకు 105 తాగునీటి కియోస్కులు ఏర్పాటు చేశారు.నిరంతర నీటి పంపిణీ కోసం మార్గం పది పెద్ద ట్యాంకులు ఏర్పాటు చేశారు.ఈ వ్యవస్థల ద్వారా ప్రతి కియోస్క్కూ సమానంగా నీరు చేరేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.శబరిమలలో మాత్రమే కియోస్క్ నిర్వహణ కోసం యనబై మంది తాత్కాలిక సిబ్బందిని నియమించారు.ఉన్నత నాణ్యతకు హామీ సరఫరా చేసే నీటి నాణ్యతను నిర్ధారించేందుకు అధికారులు కఠిన పరిశీలనలు చేస్తున్నారు. పంబాలో ఏర్పాటు చేసిన న్యాబల్ గుర్తింపు పొందిన ప్రయోగశాలలో నిరంతర పరీక్షల అనంతరం మాత్రమే నీరు కియోస్కులకు పంపిణీ చేస్తారు.నిలక్కల్లో కొత్త వ్యవస్థ
ఈసారి, పంబాపై ఆధారపడకుండా నిలక్కల్ ప్రాంతంలో నీటి పంపిణీని మరింత సమర్థవంతంగా మారుస్తున్నారు.మునుపు పంబా నుండి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు:
సీతా తోటలో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేసి నిలక్కల్కు నేరుగా నీరు పంపిస్తున్నారు.
శుద్ధీకరణ కోసం పద ముడు యమ్ యల్ డి ప్లాంట్, గంటకు ఇరవై ఏడు వేల లీటర్ల సామర్థ్యం కల్గి ఉంది.
నిలక్కల్లో యనబై ఎనిమిది కియోస్క్ల ద్వారా తాగునీరు అందిస్తున్నారు.అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ట్యాంకర్లను వినియోగించే విధానం అమల్లో ఉంది.శబరి తీర్థం ప్రాజెక్టు దేవస్థానం బోర్డు "సబరి తీర్థం" పథకం ద్వారా గుడి పరిసరాల్లో మరియు పాపంతల్ ప్రాంతంలో నేరుగా కియోస్కులు ఏర్పాటు చేసి భక్తులకు తాగునీరు అందిస్తోంది.భక్తులకు భారీ ఉపశమనం ఈ విస్తృతమైన తాగునీటి పంపిణీ వ్యవస్థ వల్ల అయ్యప్ప భక్తులకు యాత్రలో ఎంతో నెమ్మది మరియు సౌకర్యం లభిస్తోంది.