
పయనించే సూర్యుడు గాంధారి 04/02/26
భవిత కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం మండల కేంద్రంలోని భవిత ప్రత్యేక పాఠశాలలో దివ్యాంగులైన నరాల బలహీనతతో బాధపడుతున్న విద్యార్థిని, విద్యార్థులకు డాక్టర్ స్వాతి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షలను పరిసర గ్రామాలలోని విద్యార్థులు వినియోగించుకొని సకలాంగులుగా మారాలని ఆమె తెలిపారు. ఈ ఫిజియోథెరపీ క్యాంపులను వారానికి రెండు సార్లు నిర్వహిస్తామని ప్రత్యేక ఉపాధ్యాయుడు పెంటయ్య రిసోర్స్ టీచర్ సాయన్నలు తెలిపారు.