
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గంలో
భీమ్గల్ మండలంలోని బాపుజీనగర్ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు పురుషులు మరియు ఇద్దరు మహిళలను గుర్తించారు.విచారణలో, చందు (A1), కమలేష్ (A2) అద్దె ఇంటిని తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తూ, ఇతరులను ఆకర్షించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెల్లడైంది. కాగా, వికాస్ (A3) మరియు ఒక మైనర్ బాలుడు సంఘటన స్థలానికి కస్టమర్లుగా వచ్చినట్లు గుర్తించారు.ఈ సందర్భంగా రూ. 2,450/- నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు మరియు రెండు కండోమ్ ప్యాకెట్ మరియు మద్యం స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్కు తరలించారు. దర్యాప్తు కొనసాగుతోంది.రక్షించబడిన మహిళలు మరియు ఇతరులను సురక్షితంగా తరలించి, వారికి కౌన్సెలింగ్ మరియు అవసరమైన సహాయం భీంగల్ ఎస్సై తెలిపారు అందిస్తున్నారు