
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: ఈ కార్యక్రమానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మంచిర్యాల జిల్లా అబ్జర్వర్ ఎం.ఏ. లతీఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎం.ఏ. లతీఫ్ మాట్లాడుతూ విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు కష్టపడి చదివి విద్యా రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి తమ తల్లిదండ్రులకు, తమ పట్టణానికి, తమ దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అలాగే తల్లిదండ్రుల బాధ్యతలు, ఉపాధ్యాయుల గొప్పతనం మరియు వారి బాధ్యతల గురించి వివరించి, క్రమశిక్షణ, కృషి, మంచి నడవడి ప్రతి విద్యార్థి జీవిత విజయానికి పునాది అని అన్నారు.శ్రీ ఎం.ఏ. లతీఫ్ రాక సందర్భంగా విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. పాఠశాల యాజమాన్యం శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించింది. విద్యా రంగానికి ఆయన అందిస్తున్న సేవలను కొనియాడుతూ అభినందనలు తెలియజేసింది.అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శ్రీ ఎం.ఏ. లతీఫ్ గారు సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే విద్యా సేవల్లో విశిష్ట కృషి చేసిన ఉపాధ్యాయులను అవార్డులతో సత్కరించారు.