( పయనించే సూర్యుడు జూన్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
తేది 26-06-2025 గురువారం రోజున ఉదయం 11:00 గంటలకు శ్రీశ్రీశ్రీ కనకాల కట్ట మైసమ్మ అమ్మవారి గుడి , లోయర్ ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ లో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము నిర్వహిస్తున్న తొలి బోనాల జాతరను ఈ సంవత్సరము కూడా ప్రతిష్టాత్మకంగా వేలాది మంది కుమ్మర్లు ఆధ్వర్యంలో 501 బోనాలతో ఈ బోనాల జాతరను నిర్వహించవలెనని రాష్ట్ర సంఘం నిర్ణయించడము జరిగినది.కావున మన షాద్ నగర్ నియోజకవర్గం నుండి ప్రతి ఒక్క కుమ్మర కులస్తులు మన డివిజన్ అద్యక్షులు శ్రీ నడికూడ శ్రీశైలం మరియు ప్రధాన కార్యదర్శి రాయికల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు 26/06/2025 నాడు 9:00 గంటలకు షాద్ నగర్ నుండి బయల్దేరి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిపించాలని విజ్ఞప్తి చేస్తూ పోస్టర్ విడుదల చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో డివిజన్ అద్యక్షులు శ్రీ నడికూడ శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి రాయికల్ శ్రీనివాస్, పెంజర్ల రమేష్, వైన్స్ అంజయ్య, సాయిలు, యాదయ్య, శేఖర్, దూసకల్ రమేష్, రాపోల్ వెంకటేష్, జంగయ్య, వెల్డింగ్ రాజు,DCM వెంకటేష్, మేకగూడ వెంకటేష్ , టైలర్ శ్రీను, కృష్ణ, ఆటో శ్రీను, శేఖర్ తదితరులు పాల్గొన్నారు