( పయనించే సూర్యుడు జూన్ 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఈరోజు ఫరూక్నగర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల కోసం మండల ఎడ్యుకేషన్ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో 450 మార్కులు లేదా అంతకంటే ఎక్కువ సాధించిన సుమారు 450 మంది విద్యార్థులు,అలాగే పాసైన బాలికలందరిని గుర్తించి వారికి ప్రశంసాపత్రాలు, పుస్తకాలు మరియు బ్యాగులు అందజేయడం జరిగింది.అలాగే100% ఉత్తీర్ణత శాతం సాధించిన 70 మంది ఉపాధ్యాయులను గుర్తించి, వారికి మెమెంటోలు, సర్టిఫికెట్లు మరియు పుస్తకాలు అందజేశారు.ఈ కార్యక్రమాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రగతి వెల్ఫేర్ సొసైటీ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు.ప్రధాన అతిథులు CGI CSR టీమ్ సేవా భారతీ డాక్టర్స్ టీమ చంద్ర శేఖర్ అడ్వకేట్ డేగా శంకర్ కాశిరెడ్డిగూడ తొలి సర్పంచ్ దీనా శంకర్ ఇతర పాల్గొన్నవారు. సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ మురళీ కృష్ణ , ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ జగదీష్ , కార్తిక్, శ్రీకాంత్, నవ్య, ప్రగతి, తులసి, శ్వేత, లావణ్య,మరియు శృతి తదితరులు పాల్గొన్నారు.