// పయనించే సూర్యుడు// జూన్//30: మక్తల్ రిపోర్టర్ సీ తిమ్మప్ప// మక్తల్ .నియోజకవర్గం లోని జనసేన పార్టీ ఇన్చార్జ్ మణికంఠ గౌడ్ మ్యారేజ్ డే సందర్భంగా మక్తల్ లో ఉన్న స్థానిక నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులు శనివారం సాయంత్రం డాక్టర్ మణికంఠ హాస్పిటల్లో కేక్ కటింగ్ మరియు శాలువాలతో డాక్టర్ మణికంఠ గౌడ్ ని డాక్టర్ సబిత ని సన్మానించడం జరిగింది. మ్యారేజ్ డే సంబరాలకు వృధా ఖర్చులు చేయకుండా ఆ సంబరాలకు అయ్యే ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చుతో ఏదైనా అనాధ పిల్లలకు లేదా హాస్టల్ పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాల్ని ఏర్పాటు చేద్దామని డాక్టర్ మణికంఠ ఆదేశించారు.*అది దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు మక్తల్ లో ఉన్న ఆనంద నిలయం అనే హాస్టల్లో 50 మంది లో అనాధ మరియు బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ప్లేట్లు మరియు గ్లాసులు కొరతగా ఉందని తెలుసుకొని డాక్టర్ మణికంఠ గౌడ్ వివాహ దినోత్సవ సందర్భంగా ఆనందం నిలయం అనే వసతి సాంఘిక సంక్షేమ వసతి గృహాంలో కొత్తగా చేరిన 50 మంది పిల్లలకు ప్లేట్లు మరియు గ్లాసులు పంచడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ ఈ హాస్టల్లో చదువుకొని చాలా ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని స్ఫూర్తి గా తీసుకొని మీరు చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని పిల్లలకు మనోధైర్యాన్ని మరియు ఆత్మ ధైర్యాన్ని నెలకొల్పారు.* మరియు వసతి గృహం లో ఉన్న విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఉచితంగా వైద్యాన్ని అందిస్తాం అని మణికంఠ హాస్పిటల్ తరపున తెలియజేశారు. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు లు జనసేన పార్టీ చేపడుతుంది అని చెప్పారు. డాక్టర్ సబితా గౌడ్ డాక్టర్ మణికంఠ గౌడ్ మంచితనాన్ని చూసి హాస్టల్ వార్డెన్ మరియు హాస్టల్లో ఉన్న పిల్లలు సంతోషాన్ని వ్యక్తం చేశారు అలానే ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలి అని తెలిపారు.*-ఇట్టి కార్యక్రమంలో మక్తల్ జనసేన పార్టీ నాయకులు రామన్ గౌడ్, గౌడి బల్రెడ్డి, ఎడివెళ్ళి శివ , పరుశురాం, భీమేష్ . బి విశ్వనాథ్(విలేఖరి). చిన్నూరు తిమ్మప్ప(విలేఖరి). ప్యాట తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.