పయనించే సూర్యుడు: సెప్టెంబర్ 13 పెద్ద శంకరం పెట్ మండలం మెదక్ జిల్లా.( రిపోర్టర్ జిన్నా అశోక్)
మెదక్ జిల్లా శంకరంపేట-ఎ మండలం ముసాపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ముసాపేటకు చెందిన బైకాని గంగమేశ్వర్ (18) అనే యువకుడు బావిలో మృతదేహంగా కనుగొనబడ్డాడు.ఫిర్యాదుదారు బైకాని దేవయ్య తెలిపిన వివరాల ప్రకారం, గంగమేశ్వర్కు దాదాపు 1½ సంవత్సరాల క్రితం టేక్మల్ మండలం హసన్మొహమ్మద్పల్లె గ్రామానికి చెందిన ఎక్కల మానసతో వివాహం జరిగింది. ఆ వివాహానంతరం గంగమేశ్వర్ను అత్తింటివారు దత్తత తీసుకున్నారు. అయితే, కుటుంబ విభేదాల కారణంగా మూడు నెలల క్రితం మానస ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో గంగమేశ్వర్పై ఆరోపణలు నమోదై, అతను జ్యుడీషియల్ రిమాండ్లో ఉండి, ఇటీవలే జైలు నుండి విడుదలయ్యాడు.గత 11వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు గంగమేశ్వర్ ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. 12వ తేదీ ఉదయం గ్రామ శివార్లలో గోండ్ల రాములు బావి వద్ద అతని ఫోన్, బట్టలు కనిపించాయి. అనంతరం స్థానికులు గాలింపు జరిపి, ఉదయం 9:30 గంటలకు అతని మృతదేహాన్ని బయటకు తీశారు.జైలు కస్టడీ అనుభవం వల్ల వచ్చిన భయంతోనే కుమారుడు నిరాశకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ మరణంలో అనుమానాస్పద అంశం ఏదీ లేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.