•కాంగ్రెస్ ప్రభుత్వం లో దళితులకు న్యాయం.. ప్రణవ్
•జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. ప్రణవ్
• నిధుల విడుదలకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు.
పయనించే సూర్యుడు : ఫిబ్రవరి 1: హుజురాబాద్ ప్రతినిధి దాసరి రవి: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని, దళిత బంధు నిధుల విడుదల ద్వారా మరోసారి అది రుజువైందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం రోజున ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండేళ్లు ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విపుగా ఉన్న కౌశిక్ రెడ్డి దళిత బంధు నిధుల విడుదల చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు. దళితుల భావోద్వాగాలను రెచ్చగొట్టి దళితులతో దళిత బంధు రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్టు దళిత బంధు నిధుల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా లబ్ధిదారులకే నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కెసిఆర్, కేటీఆర్ కు దగ్గర అని చెప్పుకొని సోషల్ మీడియాలో రీల్స్ చేసుకోవడం పై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యల ను పరిష్కరించడంలొ లేదని, ప్రభుత్వ పథకాలపై కౌశిక్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మార్చ్ 31 వరకు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందిస్తామని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల కౌశిక్ రెడ్డి ఓర్వ లేక పోతున్నాడని, తెలంగాణ భవన్ లో ప్రెస్మీట్లో పెట్టడం కాదని ప్రజల వద్దకు వెళ్తే వారే కౌశిక్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి పలువురు జర్నలిస్టులు ప్రణవ్ నివాసంలో కలవగా వారు తెలిపిన ప్రతి సమస్యను తెలుసుకున్న ప్రణవ్ వారి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ఆందోళన చెందవలసిన అవసరం లేదని పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపారు.