పయనించే సూర్యుడు// న్యూస్ జూన్ 4//మక్తల్నారాయణపేట
జిల్లా మద్వార్ గ్రామంలో నేడు గ్రామ శివారులోని పోలమ్మ అమ్మవారికి బోనాల ఉత్సవాలు నిర్వహించారు. సందర్భంగా గ్రామస్తులంతా డప్పు చప్పులతో ఊరేగింపుగా బోనాలతో అమ్మవారి ఆలయానికి వెళ్లి కోళ్లను మేకలను నైవేద్యంగా సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. సందర్భంగా గ్రామ మహిళలు గంప జాతర నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ యువకులు మహిళలు చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.