పయనించే సూర్యుడు జూన్ 13 (పొనకంటి ఉపేందర్ రావు)
ఇల్లందు :పట్టణంలోని 14వ నెంబర్ బస్తీలో గల మార్గదర్శిని హై స్కూల్ నూతన భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇల్లందులో నాణ్యమైన విద్యను తక్కువ ఫీజుతో అందించడం సంతోషకరమన్నారు. పేద విద్యార్థులకు ఉచిత విద్య నేర్పించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. మార్గదర్శిని పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో నిలవడమే ఈ పాఠశాల విద్యకు నిదర్శనమని తెలిపారు. ముందుగా పాఠశాల యాజమాన్యం ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలొ పాఠశాల డైరెక్టర్లు దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, అర్వపల్లి రాధాకృష్ణ, యాదగిరి రాంబాబు, కొంగర బ్రహ్మం, దమ్మాలపాటి నాగేంద్రబాబు, కృష్ణార్జున రావు, టెస్మా రాష్ట్ర నాయకుడు తుమ్మలపల్లి ప్రసాద్, టెస్మా డివిజన్ అధ్యక్షుడు వెంకటస్వామి, హైదరాబాద్ ఆదిత్య కాన్సెప్ట్ స్కూల్ చైర్మన్ డా. సుధాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, నాయకులు మండల రాము, మడుగు సాంబమూర్తి, బొల్లా సూర్యం, చిల్లా శ్రీనివాస్, అంకపాక నవీన్, ఎర్ర ఈశ్వర్, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు