సిపిఎం మిర్చికి కనీసం మద్దతు ధర ను 25 వేలు గా కేటాయించి ఇవ్వాలని సిపిఎం
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 26 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు) వార్తా విశ్లేషణ ఇల్లందుమండల కార్యదర్శి వర్గ సభ్యులు తాళ్లూరి కృష్ణ రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు. ఇల్లందు మండలం లో కొమరారం, మాణిక్యారం,గ్రామాల్లో మిర్చి కల్లాలను సందర్శించి రైతులను ఇబ్బందులను అడిగి తెలుసుకోవడం జరిగింది. మిర్చి రేటు దారుణంగా పడిపోవడం తో పెట్టిన పెట్టు బడి కూడా రాకపోవడం చాలా భాదగా ఉందని రైతులు వాపోయారు. మద్దతు ధర లేకపోవడం వలన రైతు లు ఆత్మహత్య లకు పాల్పడే ప్రమాదం ఉందని కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి మిర్చి ధరను పెంచాలని అన్నారు. ఎకరానికి లక్ష రూపాయలు పై గానే పురుగు మందులు, కూలీలు ఇతరాత్ర ఖర్చులు కలిపి పెట్టు బడి పెట్టారని కనీసం కూలిలా ఖర్చులు కూడా వచ్చే అవకాశం లేకుండా పోయిందని అన్నారు.మిర్చి రైతులను ఆదుకునే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమం లో సిపిఎం నాయకులు వజ్జా సురేష్, రైతులు ధరవత్ పాపా, భూక్యా వీరు, బుజ్జి, సరోజ, నాగమణి, వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.