ప్రయాణించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే 13
జిఒ 3 ని పునరుద్ధరిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు, మండల కన్వీనర్ కొర్ర బలరాం,ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ మార్క్,జెఎసి సోషల్ మీడియా రాష్ట్ర సభ్యుడు రీమెల పాలు, జెఏసి మండల సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు లకే రామచంద్రుడు,జెఏసి మండల కార్యవర్గ సభ్యుడు కొర్ర నారాయణ ధన్యవాదాలు తెలియజేశారు.సోమవారం అమరావతిలో జరిగిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలను స్థానిక గిరిజనులకే కేటాయించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తూ, 2000 ల సంవత్సరంలో అధికారంలో ఉన్న తెదేపా ప్రభుత్వం గిరిజనల ప్రయోజనాల కోసం జిఒ3 ని రూపొందించి, ఏజెన్సీ ఉద్యోగాలు స్థానిక ఆదివాసీలకు కేటాయించామని, న్యాయ సమీక్షలు వల్ల జిఓ 3 రద్దయిందని, గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, జిఓ3 పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నామని ప్రకటించడాన్ని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి నాయకులు స్వాగతిస్తూ, ధన్యవాదాలు తెలియజేశారు.ప్రభుత్వం వెంటనే గిరిజన సలహా మండలి (టిఎసి)ని ఏర్పాటు చేయాలని,అనంతరం జిఓ3 పునరుద్ధరణలో భాగంగా వెంటనే షెడ్యూల్డ్ ప్రాంత నియామకాల చట్టాన్ని రూపొందించాలని, ప్రస్తుత మెగా డిఎస్సి నుండి ఏజెన్సీ ఉద్యోగాలను మినహాయించి, షెడ్యూల్డ్ ప్రాంత నియామకాల చట్టం రూపొందించిన అనంతరం, ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీ ని చేపట్టాలని డిమాండ్ చేశారు. గిరిజన సలహా మండలి (టిఎసి)ఏర్పాటు చేసి, ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్టాన్ని రూపొందించి ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీ ని చేపట్టేంతవరకు ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి ఉద్యమ కార్యాచరణని కొనసాగిస్తుందని తెలియజేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఐటిడిఏ కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు,స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నపాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.