పయనించే సూర్యుడు గాంధారి 08/06/25 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం లో మే నెల మొదటి రోజు నుండి జూన్ ఆరు వరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కొనసాగిన శిక్షణ శిబిరం శనివారం ఉదయం మిగిసినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు వాలీబాల్ కోచ్ లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు, ప్రతి రోజు ఉదయం సాయంత్రం వాలీబాల్, కబడ్డి క్రీడల్లో మెలుకువలు నేర్పించినట్లు ఆయన సూచించారు, మండలంలోని బిర్మల్ తండ, గుజ్జూల్, బానాపూర్, మతు సంగం, పెట్ సంగం గుడివెనక తండ నుండి విద్యార్థులు క్రీడా శిక్షణ పొందారు. బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లో సంవత్సరం మొత్తం శిక్షణ శిబిరం కొనసాగుతుందని ఆయన సూచించారు.