
పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు మార్చి 02.
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు..నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తమ ప్రియతమ నాయకుడు రాజగోపాల్ రెడ్డిని,కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు మరియు ఇందిరమ్మ గృహ కమిటీ సభ్యులు కురుపాటి గణేష్, యువజన నాయకులు కురుపాటి నరేష్ శాలువాతో ఘనంగా సన్మానించారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…మునుగోడు నియోజకవర్గ రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా,విద్యా రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపారు..నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా ఆయన అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు..ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..