పయనించే సూర్యుడు తేదీ 19 సెప్టెంబర్ శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.
నిన్న రాత్రి గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు గట్టు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనరసింహ s/o ఏది రమేష్ గౌడ్ మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన మూడు లక్షల రూపాయల ఎల్ఓసి లెటర్ ను గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్రెడ్డి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయకుమార్ సింగల్ విండో డైరెక్ట్ మహేశ్వర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు