
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మూసాపేట్ జనతా నగర్లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలుమూసాపేట్ జనతా నగర్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో, రాచమల్ల శేఖర్ గౌడ్ అధ్యక్షతన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నాయకులు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి ఇంచార్జ్ బండి రమేష్ కూకట్పల్లి బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగంఈ యొక్క కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారుమూసాపేట్ మాజీ కార్పొరేటర్లు కొడిచెర్ల మహేందర్, బి. బాబురావు,తూము శ్రవణ్ కుమార్ నాగిరెడ్డి, తూము వేణు కరక పెంటయ్య, జిల్లా గోపాల్, గూడెపు నాగరాజు సునీల్ యాదవ్, పండుగ రేణుక,ఉమావతి గౌడ్, జ్యోతి గౌడ్, తూమ్ సంతు శంకర్ కలికోట శంకర్, దాదె కిరణ్, పాండు ముదిరాజ్, నర్సింగ్, రమేష్ యాదవ్,పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ.. మొగల్ చక్రవర్తులను గడగడలాడించిన ధీరుడు, ఔరంగజేబుకు తెలంగాణ దెబ్బ రుచి చూపించిన వీరుడు, గోల్కొండ కోటను ఏలిన తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఆయన ధైర్యసాహసాలు, సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.ఈ కార్యక్రమంలో నల్ల పోచమ్మ తల్లి టెంపుల్ చైర్మన్ రాచమల్ల బిక్షపతి గౌడ్, రమేష్ గౌడ్, పండు గౌడ్, వెంకటేష్ గౌడ్, స్వామి గౌడ్, గుడికాడి శ్రీనివాస్ గౌడ్, కొత్తపల్లి రవి గౌడ్ తదితర గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.జయంతి వేడుకలను విజయవంతంగా నిర్వహించిన గౌడ సంఘం సభ్యులను నాయకులు అభినందించారు.