
పయనించే సూర్యుడుD.20.06.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండలం ఈరోజు శనివారం రోజున మెండోరా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళలకు చెత్త నిర్వహణలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామంలోని 50 మంది మహిళలకు,సర్పంచ్ కుంట లక్ష్మి రమేష్ తడి పొడి చెత్తబుట్టలను పంపిణీ చేయడం జరిగింది వారికి తడి చెత్త మరియు పొడి చెత్త వేరు చేసి వాటిని సక్రమంగా నిర్వహించడం ఎలాగో వివరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు మానస, మారుత గ్రామపంచాయతీ వార్డు సభ్యులు చెప్పాల సత్యనారాయణ డాక్టర్ సంతోష్, అబ్దుల్ షఫీ పల్లె రాము, వడ్డే భూమేష్ కాంగ్రేస్ నాయకులు పల్లె శేఖర్,చాకలి గంగాధర్ మెడికల్ సత్యం, కార్యదర్శి ప్రశాంత్ మొదలగు వారు పాల్గొన్నారు