
పయనించే సూర్యుడు డిసెంబర్5 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె మండలం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న మెగా పేరెంట్ మీటింగ్ కార్యక్రమాల్లో భాగంగా సుండుపల్లి మండల కస్తూర్బా గాంధీ పాఠశాల నందు నిర్వహించిన మెగా పేరెంట్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి చప్పిడి మహేష్ నాయుడు మండల టిడిపి అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారికి కస్తూర్బా గాంధీ విద్యార్థినిలు,ఉపాధ్యాయురాలు మార్షల్ డ్రిల్ లో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురిని శాలువాను కప్పి పూలదండను వేసి ఘనంగా పంచాయతీ కార్యదర్శి లు వీఆర్వోలు సంబంధిత ఉద్యోగులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి ప్రధాన కార్యదర్శిలు, కోశాధికారులు,గ్రామ అధ్యక్షులు, టిడిపి సీనియర్ నాయకులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు