
పయనించే సూర్యుడు అక్టోబర్ 27, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న
ఆళ్లగడ్డ, పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ ఆదేశాలమేరకు ఆళ్లగడ్డ సబ్ డివిజన్ డీయస్ఫీ కే.ప్రమోద్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన " *మెగా రక్షదాన శిబిరం " ప్రజలందరి సహకారంతో విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో ముందుగా ఆళ్లగడ్డ డిఎస్పి కే.ప్రమోద్ రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు.అనంతరం ఆళ్లగడ్డ పట్టణ సీఐ యుగంధర్ , సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు, ఇతర పోలీసు సిబ్బంది మొత్తం -27 మంది, యువత, ఇతర ప్రజలు -79 మంది మొత్తంగా 106 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన స్టేట్ రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బందికి, ప్రజలకు, ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ సిబ్బంది అందరికీ డీయస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు.
